POLITICS

కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి చంద్రబాబు

అమరావతి: మాజీ బీజెపీ రాష్ట్ర అధ్యక్షడు,,మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు.. గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన కన్నాకు, చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు….గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గంలో పట్టు ఉంది..రెండు రోజుల నుంచి పలువురు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను కలసి చర్చలు జరిపారు..కన్నాతో పాటు గుంటూరు మాజీ మేయర్, కుమారుడు కన్నా.నాగరాజు,,తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌,,మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌ తదితరులు టీడీపీలో చేరారు..కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విషయం విదితమే..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *