రాష్ట్రంలో మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను నియమించిన ఈసీ
అమరావతి: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది..ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలో బాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.. దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ వెంటనే అమలులోకి వచ్చిన కోడ్ను రాష్ట్రంలో పార్టీలు ఉల్లంఘించాయని ఈసీకి ఫిర్యాదులు అందాయి..పరస్పరం దాడులు,, హత్యలు,, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురిని ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది..ప్రత్యేక పోలీసు అబ్జర్వర్గా దీపక్ మిశ్రా,, ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్గా రామ్ మోహన్ మిశ్రా,, ప్రత్యేక ఎన్నికల వ్యయ అబ్జర్వర్ గా నీనా నిగమ్లను నియమించింది..ముగ్గురు అబ్జర్వర్లు వచ్చేవారం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి పరిస్థితులను అంచనవేయనున్నారు.