AMARAVATHIPOLITICS

బీజెపీకి మద్దతు ప్రకటించిన సినీ నటుడి కిచ్చా సుదీప్

అమరావతి: కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరుగనున్న సమయంలో కన్నడ సినీ నటుడి కిచ్చా సుదీప్ కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు.. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతోకలిసి బెంగళూరులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నసందర్బంలో సుదీప్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.. బొమ్మైతో తనకున్న అనుబంధంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.. తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని, కేవలం బీజేపీకి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడానికే వచ్చానన్నారు.. బీజేపీ సిద్ధాంతం తనకు నచ్చుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ నటుడు కిచ్చా సుదీప్‌ మద్దతు తమకు కలిసి వస్తుందని,,పూర్తి మెజార్టీతో తాము మరోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు బీజేపీకే పట్టం కడతారని బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తనకు, బీజేపీకి మద్దతిచ్చిన కిచ్చా సుదీప్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *