కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన-ముఖేష్ కుమార్ మీనా
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం పరిశీలించారు.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎంసిసి, సి విజిల్, ఓటర్ హెల్ప్ లైన్ 1950 , ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మొదలైన బృందాల పనితీరును అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు..అలాగే పారదర్శకంగా, స్వేచ్ఛగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నట్లు వెల్లడించారు..జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా SECకు జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వివరించారు.