AMARAVATHINATIONAL

హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు, చిక్కుకుపోయిన 200 పర్యాటకులు

అమరావతి: హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు రావడంతో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకుపోయారు.. మండి జిల్లా పదార్ DSP సంజీవ్ సూద్ మాట్లాడుతూ బాగిపుల్ ప్రాంతంలో ప్రషార్ సరస్సు సమీపంలో వరదల సంభవించాయన్నారు.. పర్యాటకులు, స్థానికులతోసహా 200 మందికిపైగా ప్రజలు మండి ప్రశార్ రోడ్డులోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారని,,ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.. చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు,, పరాశర్ నుంచి తిరిగి వస్తున్న అనేక వాహనాలు చిక్కుకున్నాయని పేర్కొన్నారు..ఆకస్మిక వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి హైవే మూసుకుపోవడంతో హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని ఔట్ సమీపంలో వందలాది మంది ప్రయాణికులు మార్గం మధ్యలో అగిపోవాల్సి వచ్చింది..హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాంగ్రా సిటీలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి..మండి-జోగిందర్ నగర్ హైవేని తాత్కలికంగా అధికారులు మూసివేశారు..కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఈ రహదారులపై ప్రయాణించే సాధారణ ప్రజలు, పర్యాటకులు పర్వాతాలకు ఆనుకొని ఉన్న రోడ్లపై ఉండరాదని పోలీసులు సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *