AMARAVATHIDISTRICTSPOLITICS

నాకు రాజకీయం తప్ప నాకు వేరేఏమి తెలియదు-రూప్ కుమార్

వైసీపీకి రాజీనామ..

(మార్చి 2వ తేదిన చంద్రబాబు నెల్లూరుకు వస్తున్న సందర్బంలో వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి,,మరి కొందరు వైసీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు..ఈ సందర్బంలో రూప్ కుమార్ తన అనుచరులతో కలసి టీడీపీ కండువా కప్పుకునే అవకాశలు వున్నాయని నెల్లూరు నగరీయు భావిస్తున్నరు,,,ఇందులో కొత్త విషయం ఏమన్నా వుందా ?..)

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థలో వైసీపీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు మరో 4 కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు.. బుధవారం నగరంలోని జెమ్స్ గార్డన్స్ లో రూప్ కుమార్ యాదవ్ పార్టీ కార్యాలయంలో అయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి వైసీపీకి సేవ చేశానని,,పార్టీ కోసం పని చేసిన తాము బయటకు రావడం భావోద్వాగానికి గురి చేస్తోందన్నారు..ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగిన పరిణామాలు మనసును బాధించాయని, పార్టీ కోసం కష్టపడ్డాం,, పోరాడాం,, పార్టీ మాది అనుకున్నామని కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పారు..నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ వలన పార్టీ నుంచి దూరం కావడం లేదన్నారు.. ఖలీల్, తాను దశాబ్దాలుగా కలసిమెలసి తిరిగామని రూప్ కుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్ రాజకీయాలపై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీకుంటామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *