AMARAVATHIINTERNATIONAL

ఆర్దిక సంస్కరణల అమలు కారణంగానే భారతదేశం దూసుకుని పోతొంది-క్రిస్టాలినా జార్జివా

అమరావతి: భారతదేశం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల్లో భారత్ ఆర్థిక విజయం దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యనించారు.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.. 2024 భారత్ GDP అంచనాలను IMF సవరించింది.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పై స్పందిస్తూ ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగులీనుతున్న భారతదేశం ఇక రాబోయే సంవత్సరాల్లో ఇలాగే కొనసాగుతుందన్నారు.. 2024 సంవత్సరానికి భారత్ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నమని అన్నారు.. 2023లో చాలా బలమైన పనితీరు కనబర్చినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాము అని క్రిస్టలీనా వెల్లడించారు..డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రణాళిక బద్దంగా భారత్ అమలు చేయడంతో చాలా ప్రయోజనాలు వనకుడాయని తెలిపారు..అదే ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన శక్తిగా మారిందన్నారు.. చిరు వ్యాపారులు కూడా మార్కెట్లోకి ప్రవేశించడానికి డిజిటల్ వసతులు దోహద పడ్డాయని చెప్పారు.. అయితే భారత శ్రామిక శక్తిలో నేటికీ మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *