రాష్ట్రంలో పెరగనున్న ఎండ తీవ్రత-వడగాల్పులు ప్రభావం
అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 22 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వైయస్సార్ కడప 11, నంద్యాల 4, మన్యంలో 3,, అల్లూరి 2, కాకినాడ 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.