శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం
అమరావతి: భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది..శనివారం సంభవించిన అగ్నిప్రమాదంలో పలు హౌస్ బోట్లు ధగ్థమయ్యాయి..అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు..దాల్ సరస్సులోని ఘాట్ నంబర్ 9 సమీపంలో ఉదయం 5.15 గంటల ప్రాంతంలో తనకు ఫోన్ కాల్ వచ్చిందని,,వెంటనే ప్రాంతంకు చేరుకొవడం జరిగిందని అగ్నిమాపకశాఖాధికారి ఫరూక్ ఆహ్మద్ తెలిపారు.. ప్రమాదానికి గల కారణంపై వివరాలు తెలుసుకునే యత్నాలు జరుగుతున్నాయన్నారు..
ప్రమాదంలో 5 హౌస్ బోట్లు,,3 కుటీరాలు దగ్థమయ్యాని..రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని తెలిపారు.. పర్యాటకులకు ఎటువంటి ప్రమాదం జరగలేన్నారు..సరస్సులో ‘లండన్ హౌస్, సపేనా, లల్లా రుఖ్ అనే పేర్లు గల హౌస్ బోట్లు దగ్థమయ్యాయని,,శ్రీనగర్ లోని దాల్ లేక్, నిజీన్ సరస్సుల నీటిపై తేలియాడే ప్యాలెస్ లుగా వీటికి ఖ్యాతి వుంది..ఈ లగ్జరీ హౌస్ బోట్లల్లో సంపన్నులు,, హనీమూన్ లకు వచ్చే జంటలు ఎక్కువగా విడిది చేస్తుంటారు.