రైతుల కోసం లక్ష కోట్లతో గోదాముల్లో ధాన్యం నిల్వ సామర్ధ్యం పెంపు-మంత్రి అనురాగ్ ఠాకూర్
అమరావతి: దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్గం లక్ష కోట్ల రూపాయలతో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసిందని,,ఈ పథకం కింద ప్రతి మండలంలో రెండు వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్త గోధుమలను నిర్మించనున్నట్లు కేంద్ర సమాచార వెల్లడించారు.. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం వున్న 1,450 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం నుంచి 2,150 లక్షల టన్నులకు పెరగనున్నదని తెలిపారు..రాబోయే 5 సంవత్సరాల్లో మరో 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేసేందుకు సరిపడా వ్యవస్థ అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు..ఈ పథకం పూర్తి అయితే ప్రపంచంలో అతి పెద్ద ఆహార ధాన్యాల నిల్వ గొదాములు భారత్ లో వుంటాయన్నారు..ఇప్పటి వరకు సరైన నిల్వ సదుపాయం లేక ఆహారధాన్యాలు పాడైపోతున్నాయన్ని,,దినిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు..గోదాముల నిల్వ సామర్ధ్యం పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు..ఇదే సమయంలో రవాణా ఖర్చు తగ్గుతాయని చెప్పారు..భారతదేశంలో ఏటా 3,100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుందని అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాముల్లో కేవలం 47 శాతం మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన వెల్లడించారు.