పవన్ ప్రశ్నిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో వుంది-బాలశౌరి
జనసేనలో చేరిన ఎం.పీ..
అమరావతి: ప్రభుత్వ విధానలపై దమ్ము, దైర్యంతో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో ఉదానం సమస్యకు పరిష్కరంగా ప్రభుత్వం ఆసుపత్రిని నిర్మించదని వైసీసీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు..ఆదివారం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి,, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.. అనంతరం సభలో అయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొంతు ఎత్తితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో వుందన్నారు.. రాష్ట్రంలో పవన్ ఉన్నారు కనుకే కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలు అవుతుందన్నారు..తాను ఎం.పీగా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు.. జగన్ ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.. వందల కోట్లు పెట్టీ ‘‘సిద్ధం’’ మీటింగ్ లు హోల్డింగ్స్ పెడుతున్నారని,, వైసీపీ దేనికి ‘‘సిద్ధం’’..? పారిపోవడానికి ‘‘సిద్ధ’’మా..? అంటూ ఎద్దేవా చేశారు..దేవుడు జగన్ ఒక్కరికే కాదు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీతాకు కూడా….దేవుడు జగన్ కు ఒక్కరికే కాదు అందరికీ దేవుడు ఉన్నాడన్నారు..2019 నుంచి 2024 వరకు వైసీపీలో హయంలో జరిగినవన్నీ తనకు తెలుసు అని,,రానున్న రోజుల్లో అన్ని వివరిస్తానన్నారు..