కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) కన్నుమూశారు..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు..యూట్యూబ్ లో ప్రముఖలుగా వున్న కొంతమందితో కలిసి ఆయన విజయనగరంలోని ఓ ఫాంహౌస్ లో షూటింగ్ చేశారు..విజయనగరం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సన్ స్ట్రోక్ తగిలినట్లుగా తెలుస్తోంది..దీంతో రక్త విరోచనాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.. కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టార్,, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు..ఈయన స్వస్థలం తిరుపతి.. 1968లో జన్మించారు..అసలు పేరు ఎస్.రామారావు..హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు..అటు తరువాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ ఆరంభించారు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్,,మరికొందరు ఈయన శిష్యూలే.