AMARAVATHI

ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థపై నిషేధం

అమరావతి:  భారతదేశం కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ అనుకూల సంస్థ అయిన ‘తెహ్రిక్-ఇ-హురియత్’ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశం నుంచి జమ్మూకశ్మీర్‌ను విడగొట్టేందుకు, ఇస్లాం లా స్థాపించేందుకు తెహ్రిక్-ఇ-హురియత్ పనిచేస్తోందని,, భారతదేశం కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ,, జమ్మూకశ్మీర్ ‌లో వేర్పాటువాదానికి ఆ సంస్థ పాల్పడుతోందని గుర్తించామని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చట్టవిరుద్ధ కార్యకలాపా నిరోధక చట్టం (UAPA) 1967 సెక్షన్ 3 కింద తెహ్రిక్-ఇ-హురియత్, జమ్మూకశ్మీర్ ను భారత ప్రభుత్వం నిషేధించింది..ప్రస్తుతం  ఉగ్రసంస్థకు మసరత్ అలామ్ భట్ సారధ్యం వహిస్తున్నారు. ఇండియా వ్యతిరేక,,.పాక్ అనుకూల తెహ్రిక్-ఇ-హురియత్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక ట్వీట్‌లో తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించరాదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఇండియా వ్యతిరేక ప్రచారానికి పాల్పడినట్టు గుర్తిస్తే వాటిని బలంగా తిప్పికొడతామని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *