ఇన్ యాక్టివ్ గా వున్న UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాండి-NPCI
అమరావతి: దేశంలో ఎక్కవ శాతం మంది ఉపయోగిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యాప్ల సంస్థలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ఆదేశాలు ఇచ్చింది.. డిసెంబర్ 31వ తేది నాటికి సంవత్సరం నుంచి లావాదేవీలు నిర్వహించిని UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆదేశించింది…కొంత మంది బ్యాంకు అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ల స్థానంలో కొత్త సిమ్లను తీసుకుంటున్నారని,,సదరు పాత నంబర్లను 3 నెలల తరువాత టెలికాం కంపెనీలు కొత్త వాళ్లకు కేటాయించినప్పుడు నగదు బదిలీ సమస్యలు వస్తున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గుర్తించింది.. ఈ సమస్యను పరిష్కారించేందుకు వీలుగా చెల్లింపు యాప్లు ఇన్యాక్టివ్ UPI ఐడీలను తొలగిస్తే అక్రమ నగదు బదిలీలు నిరోధించడం తేలిక అవుతుందని పేర్కొంది..