సుప్రీంకోర్టులో సీఎం షిండే ప్రభుత్వంకు ఊరట
అమరావతి: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.. చీఫ్ విప్ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్,, స్పీకర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ,ఉద్దవ్థాక్రే విశ్వాస పరీక్షను ఎదుర్కోలేదని, అందుకే ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది..అలాగే షిండే వర్గానికి చెందిన ఎమ్మల్యేలపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని, ఈవిషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది..సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం షిండేకు ఊరట లభించింది..సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్రలో షిండే ప్రభుత్వంకు ఎలాంటి ఢోకా లేదు..ఇదే సమయలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈ తీర్పు ఎదురుదెబ్బగానే భావించాలి..రాజకీయ సంక్షోభం సమయంలో స్పీకర్ ఎలాంటి పాత్రను నిర్వహించాలన్న విషయంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోనున్నది.