AGRICULTUREAMARAVATHI

కేంద్రం అదేశాలతో సబ్సీడిపై టమాటాలు సరఫరా

అమరావతి: టమాటాల థర ఇటీవలి కాలంలో వీపరీతంగా పెరిగి పోవడంతో సామాన్యులు టమాటాలను కొనుగొలు చేయలేని పరిస్థితి ఏర్పాడింది.. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటి ధరలు తగ్గే విధంగా చర్యలు చేపట్టింది..ఫలితంగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో టమాటాలు కేజీ రూ.80 చొప్పున సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.. సోమవారం నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తగ్గింపు ధరలకు టమాటాలు అందుబాటులోకి రాబోతున్నాయి.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని 500కుపైగా ప్రాంతాల్లో పరిస్థితిని పునఃసమీక్షించి, ఆదివారం నుంచి కేజీ టమాటాలను రూ.80 చొప్పున అమ్మే విధంగా ఏర్పాటు చేసింది..టమాటాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి వాటిని కొని, సరసమైన ధరలకు కన్స్యూమింగ్ సెంటర్లకు సరఫరా చేయాలని NCCF, NAFEDలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *