మాస్కో ఉగ్రదాడి కేసులో కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు
అమరావతి: రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 130 మంది మరణించిన సంఘటనలో పోలీసులకు పట్టుబడిన వారిలో నాలుగురు నేరాన్ని ఒప్పుకున్నారు.. ఉగ్రదాడి జరిగిన వెంటనే ఆప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేసి 11 మందిని అరెస్ట్ చేసి విచారించారు.. అధికారుల అదుపులో ఉన్న దలేర్డ్జోన్ మిర్జోయెవ్ (32), సైదాక్రమి రచబలిజోడా (30), ముఖమ్మద్సోబిర్ ఫైజోవ్ (19), షంసిదిన్ ఫరీదుని (25) ముష్కరుల్ని మాస్కోలోని బాస్మన్నీ జిల్లా కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు..వారిలో ముగ్గరు నేరాన్ని అంగీకరించారు..సంగీత కచేరీపై తుపాకులు, బాంబులతో విరుచుపడిన వారిలో తామూ ఉన్నామని కోర్టుకు వెల్లడించారు..దీంతో ఈ నలుగురినీ మే 22 వరకూ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది..ఒకరు మాత్రం విచారణ జరుగుతున్నంత సేపూ వీల్ఛైర్లో కళ్లు మూసుకొనే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది..వీరిని ఆఫ్ఘానిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఉగ్రముఠాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.
(శుక్రవారం రాత్రి ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్నిక్ సంగీత కార్యక్రమం జరుగుతున్న క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ (ISIS) ప్రకటించింది.)