రూ.999కే జియోభారత్ 4జి స్మార్ట్ ఫోన్, జూలై 7నుంచి మార్కెట్ లో లభ్యం
అమరావతి: దేశీయ మొబైల్ రంగంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది..జియోభారత్ 2జి నుంచి 4జికి ప్రమోట్ చేసే నేపధ్యంలో జియో భారత్4జి పేరుతో ఫోన్ లాంచ్ చేసింది.. రూ.999లకే కార్బన్ కంపెనీ భాగస్వామ్యంలో ఈ ఫోన్ అందుబాటులో తెచ్చారు..జూలై 7వ తేది నుంచి 10 లక్షల జియో భారత్ 4జి ఫోన్లు మార్కెట్లోకి విక్రయించనుంది..28 రోజుల వ్యాలిడిటీతో 14 జీబీ డేటా (రోజుకు 0.5జీబీ) అందిస్తున్నారు.. సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.. రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది..దేశంలో ఇప్పటివరకు 25 కోట్లమంది జియో మొబైల్స్ వాడుతున్నారని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు.. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందన్నారు.. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని జియో వర్గాలు తెలిపాయి.. స్క్రీన్ కింద కీప్యాడ్, జియో భారత్ బ్రాండ్ తో ఇతర ఫీచర్ ఫోన్ మాదిరిగానే కనిపిస్తున్నప్పటికి ఇది 4జి స్మార్ట్ ఫోన్.. దీనిలో వెనకభాగాన కెమెరా, స్పీకర్లు ఉంటాయి..ఇండియాలో ఎక్కడికైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.. అలాగే యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది..