AMARAVATHINATIONAL

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 6వ సారి పాల్గొంటూన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథి?
అమరావతి: 2024 జనవరి 26వ తేదిన జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది..ఈ విషయాన్ని వార్తా సంస్థ పీటీఐ శుక్రవారం మాక్రాన్ ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించినట్లు పేర్కొంది.. ఫ్రాన్స్ అధ్యక్షుడు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నడం ఇది 6వ సారి..ఇటీవలే ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్ తో ప్రధాని మోదీ మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు మనదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గతంలో వెల్లడించారు..మోదీ ఆహ్వానాన్ని బైడెన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు..రిపబ్లిక్ డే వేడుకలను బైడెన్ ముఖ్య అతిథిగా వస్తారని అంతా భావించారు..అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న కారణాల రీత్యా ఆయన ఈ వేడుకలకు హాజరుకాకపోవచ్చని సమాచారం అందిందినట్లు తెలియ వచ్చింది..ఈ నేపథ్యంలోనే తాజాగా మాక్రాన్ ను భారత్ ఆహ్వనించినట్లు తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *