AMARAVATHISPORTS

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన బాడీని సస్పెండ్ చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ

అమరావతి: సంజయ్ సింగ్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీని సస్పెండ్ చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది..బీజేపీ ఎంపీ, మాజీ WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడుగా ఎన్నిక కావడంపై నిరసలకు దారితీసింది..ఇదే సమయలో అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే ఆయన ఈ ఏడాది చివర్లో గోండా (యూపీ)లోని నందిని నగర్లో నేషనల్స్ జరుగుతాయని ప్రకటించారు..ఈ ప్రకటనను తొందరు పాటు చర్యగా,, రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంగా క్రీడల మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.. WFI ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఉన్నట్టు,, స్పోర్ట్స్ కోడ్ ను పూర్తిగా ఆతిక్రమంచినట్లు కనిపిస్తోందని క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొంది..మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఫెడరేషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని భావించాల్సి వస్తోందని,, గతంలో క్రీడాకారులు లైంగిక వైధింపులను ఎదుర్కొన్నట్టు చేసిన ఆరోపణల అంశం ప్రస్తుతం కోర్టు విచారణ ముందు ఉందని వెల్లడించింది..సంజయ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ బాడీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు..సంజయ్ సింగ్ గత గురువారంనాడు WFI కొత్త అధ్యక్షుడిగా 47 ఓట్లకు 40 ఓట్లు గెలుచుకుని సంచలన విజయం సాధించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *