కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వైఎస్ షర్మిల
కాంగ్రెస్ లొ, పార్టీ విలీనం..
అమరావతి: వైఎస్ షర్మిల ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.. ఢిల్లీకి 4వ తేదీన రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది.. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు.. షర్మిలకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది 4వ తేది తరువాతనే స్పష్టత రానున్నది.