AMARAVATHICRIME

గుజరాత్ సముద్ర తీరంలో రూ.425 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్-కోస్ట్ గార్డ్స్

అమరావతి: దేశంలోకి సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కొంత మంది విదేశీ వ్యక్లులను  Indian coast guard (ICG) సిబ్బంది అరెస్ట్ చేశారు..డ్రగ్స్ రవాణా గురించి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సమాచారం ఇచ్చిందని రక్షణశాఖ ప్రజా సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది..ఇరాన్ కు ఐదుగురు వ్యక్తులు అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ లోని కచ్ జిల్లా, ఓఖా సముద్ర తీరం నుంచి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా  పట్టుబడ్డారు..స్మగ్లర్స్ ను బోటు ఆపాలని కోస్ట్ గార్డ్స్ హెచ్చరించినప్పటికీ, వారు వినకుండా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని,,అయితే కోస్ట్ గార్డ్స్ వారిని వెంబడించి అడ్డుకోవడం జరిగిందన్నారు.. బోటులో 61 కేజీల హెరాయిన్ వీరు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు..దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.425 కోట్లు ఉంటుందని చెప్పారు..స్మగ్లర్స్ ను అరెస్ట్ చేసేందుకు రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ బోట్లను రంగంలోకి దించడంతో,స్మగ్లర్ దొరికిపోయారని తెలిపారు..అరేబియా సముద్రంలో అనుమానస్పదంగా కనిపించే పడవలపై కోస్ట్ గార్డ్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టినట్టు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *