సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల డెవలప్ మెంట్ నిధుల దుర్వనియోగం కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం విదితమే..చంద్రబాబు పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్(Caveat Petition) దాఖలు చేసింది..తన అరెస్ట్ చెల్లదని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.. హైకోర్టు దీన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు..సుప్రీంకోర్టు కంప్యూటర్ జనరేటడ్ లిస్ట్ లో అక్టోబర్ 6వ తేదీన విచారణ జరగనుంది అని ఉంది..అయితే బుధవారం విచారణ సమయంలో కేసును అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు..దీంతో విచారణ 3న జరుగుతుందా? లేక 6న ఉంటుందా? అన్న దానిపై ఉహగానలు కొనసాగుతోన్నాయి.