AMARAVATHI

బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం,8వ తేదికి తుఫానుగా మారే అవకాశం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ,మంగళవారం  సాయంత్రానికి అదే ప్రాంతములో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియచేశారు. క్రమంగా మరింత బలపడి డిసెంబర్ 7వ తేది సాయంత్రంకు నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి & ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటుందని తెలిపారు. డిసెంబర్ 8వ తేది ఉదయనికి   తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.తదుపరి 48 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి & దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలువైపు కదులుతుందని వెల్లడించారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- బుధ,,గురువారల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.ఈదురు గాలులు (గంటకు 40 -50 కి మీ  గరిష్టంగా 60 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-బుధ,,గురువారల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *