AMARAVATHIDISTRICTS

బీసీలకు నమ్మకద్రోహం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం- నిమ్మల కిష్టప్ప

నేతల రౌండ్ టేబుల్ సమావేశం…

నెల్లూరు: నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణమండపంలో టిడిపి నెల్లూరు జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నమ్మకద్రోహంపై కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బీసీలు ఇంకా అభివృద్ధి చెందాలని,,ఇందుకు ప్రభుత్వాల తోడ్పాటు ఉండాలన్నారు..ఎవరి నాయకత్వంలో బీసీలు అభివృధి చెందారో, ఎవరి నాయకత్వంలో బీసీ లు వెనుకబడ్డారో అందరూ ఆలోచించాలని,,బీసీ నాయకులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు..ఎన్ని తప్పులైనా చేయండి…కానీ నా నాయకత్వాన్ని సమర్థించండి అని వైసీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్ లు హాజరయ్యారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తీర్మానాలను ప్రవేశపెట్టారు.. సమావేశంలో వివిధ పార్టీల నేతలు, కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు….

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *