కాంతార సినిమా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు-నాపై బాధ్యత మరింత పెరిగింది-రిషబ్ శెట్టి
అమరావతి: చిన్న సినిమాగా విడుదలై,,బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ రికార్డు సృష్టించిన కాంతార సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుంది..మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ కేటగిరీలో `కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టిని ఈ పురస్కారం వరించింది..ఆదివారం ముంబయిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 సంవత్సరానికి గానూ కాంతారకు ఈ అవార్డు దక్కింది..ఈ విషయాన్ని నటుడు రిషబ్ శెట్టి ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు..ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు..ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నానాన్ను,,తనపై నమ్మకం వుంచి,,ఈ సినిమా తీసేందుకు అవకాశం ఇచ్చిన హోంబాలే ఫిల్మ్స్ కు, విజయ్ కిరగందూర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు..తన భార్య ప్రగతి శెట్టికి, మద్దతు ఇచ్చిన కాంతారావు బృందానికి, సాంకేతిక నిపుణులకు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు..అలాగే ఈ అవార్డును తాము దైవంగా భావించే పవర్ స్టార్,, లెజెండరీ భగవాన్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నానని పోస్ట్ లో పేర్కొన్నాడు.