అవుకు జలాశయంలో పడవ ప్రమాదం,ఇద్దరుమృతి
అమరావతి: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో బోటు బోల్తాపడి 12 మంది నీటిలో పడిపోయారు..ఈ ఘటనలో ఇద్దరు నీటిలో మునిగి మరణించాగా,మరోకరి అచూకీ దొరకలేదు..ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చినట్టు తెలుస్తోంది..ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే వున్న స్థానికులు వెంటనే స్పందించి 9 మందిని రక్షించారు..పర్యాటకులు లైప్ జాకెట్లు ధరించి వుండడంతో,పెను ప్రమాదం తప్పింది..సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..2018లో ప్రభుత్వం ఆవుకు జలాశయంను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేసి, బోటు షికారు ప్రారంభించింది.. అప్పటి నుంచి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.