సరికొత్త రంగులతో ప్రయాణానికి సిద్దం అవుతున్న వందేభారత్ రైళ్లు
అమరావతి: వందే భారత్ రైళ్లు సరికొత్త రంగులతో ప్రయాణానికి సిద్దం అవుతున్నాయి..ఇంత వరకు నీలం,, తెలుపు రంగుల్లో వందే భారత్ సేవాలు అందిసుస్తున్నాయి..కొత్తగా మారిన ఈ రంగులను మన దేశ త్రివర్ణ పతాకం నుంచి కొత్త రంగును తీసుకున్నామని రైల్వే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు..శనివారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ని సందర్శించి మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ రైళ్ల తయారీని,,అధికారులతో కలిసి కొత్త తరం హై-స్పీడ్ రైళ్ల ఉత్పత్తిని పరిశీలించారు..దీనికి సంబంధించిన ఫోటోలను..కొత్త రంగుతో సిద్దమైన వందే భారత్ రైలు ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు..ఐసీఎఫ్ లోని అధికారులు, సిబ్బందితో మంత్రి మాట్లాడి వారితో కలిసి ఫొటోలు దిగారు.. ఇప్పటి వరరు నీలం, తెలుపు రంగుల్లో ఉన్న వందే భారత్ రైళ్లు ఇక నుంచి “ఆరెంజ్.. గ్రే కలర్” కాంబినేషన్ లో రానున్నాయి.. వందే భారత్ రైలులో 25 కొత్త మార్పులు చేశామని,,ఈ మార్పులు ప్రయాణీకుల అభిప్రాయాల మేరకే చేశామని మంత్రి తెలిపారు..సీటు యాంగిల్ ను కూడా మార్చామని,, సీట్లకు మెరుగైన కుషన్,, మొబైల్ చార్జింగ్ పాయింట్లకు గతం కంటే మెరుగైన సౌకర్యం,, ఎగ్జిక్యూటివ్ చైర్ ఫుట్ రెస్ట్,,వాష్ బేసిన్ల లోతు,, టాయిలెట్ లో వెలుతురు వంటి పలు విషయాల్లో మార్పు చేశామని తెలిపారు..అలాగే కొత్త సెక్యురిటీ ఫీచర్ యాంటీ-క్లైంబర్స్ పై కూడా పని జరుగుతోందని తెలిపారు.