నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియామకం
నెల్లూరు: రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా వైసీపీ రెబల్ రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు..నెల్లూరు రూరల్ లో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.