AMARAVATHINATIONAL

ఉత్తర భారతదేశంను అతలా కుతలం చేస్తున్నభారీ వర్షాలు

అమరావతిం ఉత్తర భారతదేశంను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి..ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తొంది.. ఉత్తరాఖండ్,, హిమాచల్,,పంజాబ్,, రాజస్థాన్ లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్,,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వంతెనలు,, రోడ్లు,,రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి..భారీగా ఆస్తి నష్టం సంభవించింది..ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం నమోదు అయింది..భారీ వర్షాల ప్రభావంతో ఢిల్లీలో పాఠశాలకు సెలవులు ఇచ్చారు..సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు.. జులై 15 వరకు భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది..హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి..పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోతుండగా, కార్లు కాగితపు పడవల్లా తేలుతున్నాయి.. ఈ భయానక దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితిని తెలియజేస్తున్నాయి..మనాలిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు సెకన్లలో వ్యవధిలో వరద నీటిలో కొట్టుకుపోయింది..బస్సులో 20 మంది ప్రయాణిస్తుండగా ముందు జాగ్రత్తల్లో బాగంగా వారిని బస్సు నుంచి దించివేసినట్లు అధికారులు తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *