11 అంశాలతో మినీ మేనిఫెస్టోకు ఆమోదం-టీడీపీ,జనసేన పార్టీల సమన్వయ కమిటీ
అమరావతి: సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకుని అధికారపార్టీను ఎదుర్కొనేందుకు కలసి సాగుతున్న జనసేన-టీడీపీలు,,ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో తొలి అడుగు వేశాయి..తెలుగుదేశం-జనసేన పార్టీల సమన్వయ కమిటీ 11 అంశాలతో మినీ మేనిఫెస్టోకు ఆమోదం తెలిపినట్లు ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు..తెలుగుదేశం సూపర్ 6 పథకాలకు తోడుగా జనసేన ప్రతిపాదించిన 5 అంశాలకు అంగీకారం తెలిపామన్నారు.. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందని,, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామన్నారు..ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని,,అలాగే అమరావతే రాజధానిగా కొనసాగిస్తామన్నారు.. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం లాంటి పథకాలు కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు..”ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు..రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు లేని సమస్యలను జగన్ సృష్టించారని ఆరోపించారు..ఈ సమస్యలను పరిష్కరించే దిశగా పలు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు..తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చించి,,సదరు సమావేశాలో చర్చకు వచ్చిన విషయాలను పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు..సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు..సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని వెల్లడించారు..