AMARAVATHI

ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాం-ముకేశ్ కుమార్ మీనా

అమరావతి: 2024లో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు..ఇప్పటికే దీనిపై ప్రత్యేకంగా ప్రచారం చేశామని,,ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు..అక్టోబర్ 17వ తేదిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తామని,,అభ్యంతరాల స్వీకరణ ముగిశాక, 2024, ఫిబ్రవరి 5వ తేదిన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు..రాజకీయ పార్టీలు BLAలను నియమించుకోవచ్చని చెప్పారు..ప్రతి 1,000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని అయితే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ ఉన్నాయని తెలిపారు..ఓటులేని వారు ఇప్పుడు ఓటు నమోదు చేసుకోవచ్చని అన్నారు.. ఓటర్ల జాబితా ప్రక్రియను పారదర్శకంగా రూపొందిస్తామని,,ఏపీలో యువ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారని పేర్కొన్నారు..CSE సాఫ్ట్ వేర్ ద్వారా తాము 10.20 లక్షల మంది డబుల్ ఓటర్లుగా నమోదు అయినట్లు గుర్తించామన్నారు..డూప్లికేట్ ఓటర్లను మాత్రమే తొలగించామని,, ఎక్కడా నిజమైన ఓటర్లను తొలగించలేదని తెలిపారు..చాలా మంది ఓటర్లను జాబితల నుంచి తొలగిస్తున్నరన్న ప్రచారంలో నిజం లేదన్నారు..సచివాలయాల వాలంటీర్లు ఎన్నికల కమిషన్ లో భాగం కాదని స్పష్టం చేశారు.(రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై,,ప్రభుత్వంను రద్దు చేసినట్లయితే,,ఎన్నికల కమీషన్,,ప్రభుత్వం రద్దు అయిన 6 నెలల లోపే ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు..మరి రాష్ట్రంలో ఏం జరగనున్నది?)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *