INTERNATIONAL

రష్యాతో క్రిమియాను కలిపే వంతెనపై ట్రక్కుతో బాంబు దాడి

అమరావతి: ఉక్రెయిన్ దుందుడుకుగా వ్యవహరిస్తొందా?లేక ఐరోపా దేశాల కుట్ర ఏమైన వుందా అన్నసందేహలు లేవనేత్తే సంఘటన క్రిమియాలో చోటు చేసుకుంది.. విషయంలోకి వెళ్లితే…తూర్పు ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్‌లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించిన కొన్ని గంటల తరువాత రష్యాతో విలీనమైన క్రిమియాను రష్యాతో కలిపే వంతెనపై ట్రక్కు బాంబు పేలింది.శనివారం ఉదయం 6 గంటల సమయంలో సంభవించిన పేలుడుతో బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోయిందని రష్యా అధికారులు వెల్లడించారు.రష్యా, క్రిమియాను కలిపే కీలకమైన రోడ్డు, రైలు వంతెన. ట్రక్కు బాంబు పేలుడు కారణంగా వ్యాపించిన మంటలతో రైలు ద్వారా తీసుకెళ్తున్న ఏడు ఇంధన ట్యాంకులకు మంటలు వ్యాపించి దగ్దమైనట్లు రష్యా అధికారులు తెలిపారు. ఫలితంగా వంతెనలో కొంత మేర కూలిపోయిందని రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ పేర్కొంది. ఈ ఘటనపై రష్యన్ అధికారి ఒలేగ్ క్రుచ్‌కోవ్‌ మాట్లాడుతూ, ఈ ఘటన తరువాత వంతెనపై ట్రాఫిక్‌ను నిలిపివేసి,,మంటలను అదుపులోకి తేచ్చే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బ్రిడ్జికి మంటలు వ్యాపించిన, ఇంధన ట్యాంకర్లు దగ్దమవుతున్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ వంతెన రష్యాలోని ప్రాంతాలను ఉక్రెయిన్‌లోని క్రిమియాను కలుపుతుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా.. దక్షిణాన పోరాడుతున్న రష్యన్ సైనికులకు సైనిక పరికరాలను తీసుకెళ్లడానికి, అలాగే అక్కడ ఉన్న దళాలను రవాణా చేయడానికి కీలకమైన వారధిగా పనిచేస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *