శ్రీకాళహస్తీలో మనోహరంగా ముక్కంటి రథోత్సవం
శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుడి రథోత్సవం శంభో శంభో శంకర అంటూ భక్తుల నిరాంజనల మథ్య రథంపై అమ్మవారితో హరుడు శ్రీకాళహస్తీ పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు..శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు అమ్మవారి రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. నాలుగు మాడవీధులు భక్త జనంతో నిండిపోయాయి. రధాన్ని అలంకరించి స్వామి అమ్మవార్లను రథంపై ప్రతిష్టించారు. శాస్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ముందుకు రథాలు కదిలాయి. వీధులు ఇసుక వేస్తే రాలనంతగా భక్తులతో కిటకిటలాయి.స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. వీధులలో కిక్కిరిసిన భక్తులు రధాలపై ఉప్పు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.