భారతీయ రైల్వేల చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైంది-ప్రధాని మోదీ
అమరావతి: రైలు ప్రయాణం అందుబాటులో ఉండటం మాత్రమే కాదు,,సౌకర్యవంతంగా,,సంతోషంగా జరిగేలా చూడాలన్నదే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..అదివారం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ క్రింద దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి అమృత్ స్టేషన్ ఆ నగర ఆకాంక్షలకు, భారత దేశ ప్రాచీన వారసత్వ చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటుందన్నారు..భారతీయ రైల్వేల చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాన మంత్రి అన్నారు..అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తున్న భారత దేశం,,అమృత కాలం ప్రారంభంలో ఉందన్నారు..నూతన శక్తి,,ప్రేరణ,,సంకల్పాలు ఉన్నాయని తెలిపారు..ప్రపంచం భారత దేశంవైపు చూస్తుందని,,ఇందుకు రెండు కారణాలు వున్నాయన్నారు..అందులో మొదటిది 30 ఏళ్ళ తర్వాత ప్రజలు పరిపూర్ణ ఆధిక్యతతో ఓ పార్టీని ఎన్నుకోవడమని,, రెండోది, సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుండటమని వెల్లడించారు..ఆధునిక రైల్వే స్టేషన్ల వల్ల పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని,,ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు.