చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి,నేత కార్మికులకు తమ వంతు సహకారం అందించాలి-కలెక్టర్
నెల్లూరు: చేనేత కార్మికులకు అండగా వుంటూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ అన్నారు..జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ ఆవరణలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను కలెక్టర్,రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ యం.ఆదిలక్ష్మి,తో కలసి ప్రారంభించారు..అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు దేశ వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు..దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మనదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులనే వినియోగించాలని జాతిపిత మహాత్మాగాంధీ పిలుపునివ్వడం జరిగిందన్నారు..ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్, ప్రజలకు సూచించారు.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు ఈరోజు ఎదో ఒక చేనేత వస్త్రాన్ని కోనుగోలు చేయాలని, ఈ విధంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం వలన చేనేత రంగాన్ని ప్రోత్సహించిట్లు అవుతుందన్నారు.