AMARAVATHI

చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు

క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..
అమరావతి: చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ చుక్కెదురైంది.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ 13న హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాఖలు చేశారు..దీనిపై ఇరుపక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం,,వాదనలు ముగిసినా తీర్పును వెల్లడించకుండా రిజర్వ్ చేసిన కోర్టు,,శుక్రవారం తీర్పును వెల్లడిస్తు క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లుగా వెల్లడించింది..చంద్రాబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వేలు వాదించారు..అలాగే సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు..చంద్రబాబుకు రిమాండ్ అవసరం లేదు అంటూ లూథ్రా పలు కేసుల అంశాలను కోర్టు ముందుంచారు..అయినా కోర్టు మాత్రం సీఐడీ న్యాయవాది వాదనలనే పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తొంది..
ఏసిబీ కోర్టు కస్టడీ:- స్కిల్ డెవలప్ మెంట్ అక్రమ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబును రెండు రోజుల పాటు(23,24వ తేదిలు) సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది..5 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోరినప్పటికీ 2 రోజులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది..
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు…
చంద్రబాబు విచారణ సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంటుందని,, న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదని కోర్టు హెచ్చరించింది..చంద్రబాబు ఆరోగ్య,,వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,,కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *