DISTRICTS

విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత విద్య అడ్మిషన్ల పై బోర్డులు ఏర్పాటు చేయాలి-పేరెంట్స్ అసోసియేషన్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009 అనుసరించి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు,/ఐబి, /ఐ సి ఎస్ సి/,సీబీఎస్ఈ, పాఠశాలల్లో ఉచిత విద్య అందించేందుకు రాష్ట్రంలో నోటిఫికేషన్ ను 2023 మార్చి 4వ తేదీ విడుదల చేసిందని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ మలిరెడ్డి కోటారెడ్డి,అధ్యక్షులు నరహరిలు ఒక ప్రకటనలో తెలిపారు.అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం (2023 మార్చి6తేదీ) నుంచి ప్రారంభమైందన్నారు.గ్రామ, వార్డు సచివాలయంలో  ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఉచితంగా చేయనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించింది.. ప్రతి ప్రైవేటు పాఠశాల నోటీసు బోర్డుపై విద్య హక్కు చట్టం నోటిఫికేషన్ ఉంచాలని ఆదేశించిందని తెలియచేశారు..జిల్లా స్థాయి, మండల విద్యాశాఖ అధికారులకు విద్య హక్కు చట్టంపై అవగాహన , నిర్లక్ష్య ధోరణి, ప్రైవేటు విద్యాసంస్థల,చట్టాల అమలు పట్ల ఉదాసీన వైఖరి,ఫలితంగానే విద్య హక్కు చట్టం 2009 ఉచిత విద్య హక్కు నీరుకారుస్తున్నారని ఆరోపించారు.. ప్రవేట్ పాఠశాలల్లో విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయడం కాని పత్రికా ప్రకటనలు,పాఠశాలల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయక పోవడాన్ని ఖండిస్తున్నామన్నారు..వెంటనే అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత విద్య అడ్మిషన్ల పై బోర్డులు ఏర్పాటు చేయాలి. పత్రిక, మీడియా  ద్వారా ప్రచారం చేయాలని గ్రామ వార్డు సచివాలయంలో విద్యా హక్కు చట్టం అడ్మిషన్లు ఉచితంగా చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *