AMARAVATHICRIMEHYDERABAD

గాలిపటాలు,మాంజా దారం కారణంగా ఇద్దరు మృతి

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి..గాలి పటాల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..విశాఖపట్నంకు చెందిన కోటేశ్వరరావు సైన్యంలో వైద్యవిభాగంలో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు..శనివారం రాత్రి విధులు ముగించుకొని ఆయన ఇంటికి బైక్ పై వెళ్తున్న సమయంలో లంగర్ హౌస్ పై వద్ద గాలిపటంకు వున్న మాంజా దారం మెడకు చుట్టుకున్నది.. దీంతో రోడ్డుపై పడిపొవడంతో తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే ఆయను ఆసుపత్రికి తరలించినప్పటికి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు..అలాగే అల్వాల్ లో యువకుడు ఆదివారం భవనంపై గాలిపటం ఎగురువేస్తూ అదుపు తప్పి కిందపడ్డి మరణించాడు.. మృతుడిని పేట్ బషీర్ భాగ్ పోలీస్ ఎస్ఐ తనయుడు ఆకాశ్ గా గుర్తించారు. చైనా మాంజాదారంపై నిషేధం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పలువురు వ్యాపారులు విక్రయిస్తున్నారు..తెగిపోయిన గాలిపటాల కారణంగా రోడ్డుపై ప్రయాణిస్తున్న మనుషులు,, పక్షులు సైతం బలవుతున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *