AMARAVATHIINTERNATIONAL

అమెరికాలో మరోసారి కాల్పులు- ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు మృతి

అమరావతి: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు మరణించాడు..ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ (24) అమెరికాకు 2021 నవంబరులో ఎమ్మెస్ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు.. అప్పటి నుంచి క్లీవ్లాండ్ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడే ఉంటున్నాడు..మరో రెండు నెలల్లో అతని డిగ్రీ పూర్తి కావస్తుంది..ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగిగా ఒహాయోలోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు..ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న కొడుకు మృతి చెందడంతో తల్లి జయశ్రీ జీర్ణించుకోలేకపోతున్నారు..ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పని చేస్తూ రెండేళ్ల క్రితం సాయేశ్ తండ్రి మృతి చెందారు..ప్రభుత్వం సహకరించి సాయేశ్ మృతదేహాన్ని త్వరితగతిన తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *