AMARAVATHINATIONAL

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు దుర్మరణం

అమరావతి: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం జరిగిన ఉగ్ర దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. రాజౌరీలోని భింబేర్ గలీ-పూంచ్ సెక్టార్ మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది..ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపధ్యంలో తొలుత పిడుగుపాటు కారణంగా ప్రమాదం జరిగి వాహనంలో మంటలు చెలరేగి ఐదుగురు మరణించారని వార్తలు రాగా,,తరువాత ఉగ్రదాడి వల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రకటించారు..49 రాష్ట్రీయ రైఫిల్స్ 13 సెక్టార్ రోమియో ఫోర్స్ కి చెందిన జవాన్లు, రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు.. గురువారం కొందరు గుర్తు తెలియని దుండగులు సైనికులు ప్రయాణిస్తున్న వాహనం పై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో పాటు గ్రేడ్లు విసరడంతో వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.. ఈ ప్రమాదం తీవ్రంగా గాయపడిన జవాన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు..దాడి జరిగిన ప్రదేశంలో ఉగ్రమూకల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు భారత సైన్యాఅధికారులు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *