అధికారంలో ఉన్నంత సేపు దేశాభివృద్ధిపైనే దృష్టి పెట్టాము-ప్రధాని మోదీ
ఆదిలాబాద్ లో రూ.6,697 కోట్లతో అభివృద్ధి..
హైదరాబాద్: ఆదిలాబాద్ పర్యటనలో బాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు..రూ.6,697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.. రామగుండంలో రెండో థర్మల్ పవర్ యూనిట్ను,, రూ.70 కోట్లతో అంబారి-ఆదిలాబాద్-పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్ను జాతికి అంకితం చేశారు..491 కోట్లతో ఆదిలాబాద్-బేలా మధ్య NH-353Bపై 32.97 కి.మీ. మేర 2వ లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు..
ఆదిలాబాద్ కేంద్రంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగి బీజేపీ బహిరంగ సభలో మోదీ ఒక్కరే పాల్గొని ప్రసంగించారు..గత తొమ్మిది ఏళ్లలో దేశం ఏవిధంగా అభివృద్ధి చెందతుందో వివరించారు.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి..అధికారంలో ఉన్నంత సేపు దేశాభివృద్ధిపైనే దృష్టి పెట్టామన్నారు.. త్వరలోనే ప్రపంచంలో అత్యుత్తమ ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.