తిరుపతిలో భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం, 25 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
తిరుపతి: తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు వేర్వేరు ఘటనలో 25 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు చేసి,,వీరి వద్ద నుంచి 21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని,, మూడు వాహనాలను సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు..గురువారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రెడ్డివారి పల్లి ఫారెస్ట్ పరిధిలోని పెద్దకోనవంక వద్ద,, కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద స్మగ్లర్స్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు..పట్టుబడిన వారిలో గతంలో పీడీయాక్టు నమోదైన నిందితులు ఉన్నారని,, పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడితే వారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు..తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ స్మగ్లర్లు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు..బెంగళూరు నుంచి అనంతపురం మీదుగా నంద్యాల వైపు చేరుకుని శేషాచలం అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు చేరుకుంటున్నారని వెల్లడించారు..స్మగ్లర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని,,ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అదుపు చేస్తామన్నారు.