నవంబరు రెండో వారం నుంచి డిశంబరు మొదటి వారం మధ్య ఐదు రాష్ట్రలోఅసెంబ్లీ ఎన్నికలు ?
అమరావతిం దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు రోజుల్లో వెలువడే ఆవకాశం వున్నట్లు సమాచారం.నవంబరు రెండో వారం నుంచి డిశంబరు మొదటి వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయుత్తం అవుతొందా..? రాజస్థాన్,, మధ్యప్రదేశ్,, ఛత్తీస్ గఢ్,, తెలంగాణ,,మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాల నుంచి సమాచారం.. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12 నుంచి 20వ తేదిల్లో,, మధ్యప్రదేశ్,, మిజోరం ఎన్నికలు నవంబర్ 28వ తేదీన,, రాజస్థాన్,, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు ఆనధికారికంగా వెల్లడించాయి..రాష్ట్రాల్లో పరిస్థితులను అనుసరించి పోలింగ్ తేదీలను నిర్ణయించే అవకాశం వుంది…