NATIONAL

ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు మృతి

అమరావతి: భారత్-చైనా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న సిక్కిం ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. 3 వాహనాలతో కూడిన ఆర్మీ కాన్వాయ్ ఛాటెన్ ప్రాంతం నుంచి తంగు వెళ్తుండగా,, సిక్కింలోని జెమా ప్రాంతం మలుపు వద్ద దారి ఇరుకుగా ఉండటంతో వాహనం అదుపుతప్పింది. దీంతో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించి, ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల సేవలను దేశం ఎప్పుడూ మర్చిపోదని,, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *