ఈ నెల 19 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం మరోసారి పొడిగించింది..ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ గురువారంతో ముగిసింది.. రిమాండ్ పొడిగించాలని కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది..చంద్రబాబును వర్చువల్ గా విచారించిన జడ్జి,, 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
బెయిల్, కస్టడీ పిటిషన్ల:- చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో ఇరు పక్షలకు చెందిన లాయర్ల మధ్య వాగ్విదాం తీవ్రస్థాయికి చేరడంతో తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.