తిరుపతి స్టేషన్ యార్డులో పట్టాలు తప్పిన భొగీ,ఆలస్యం నడవనునన రెండు ట్రైన్లు
తిరుపతి: తిరుపతి స్టేషన్ యార్డులో బుధవారం సాయంత్రం పద్మావతి ఎక్స్ప్రెస్ కు సంబంధించి భొగీ పట్టాలు తప్పింది.. ట్రైనుకి కోచ్లను అనుసంధానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది..ఈ సమయంలో టైయిన్ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేరు..వెంటనే రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.. షంటింగ్ చేస్తుండగా పద్మావతి ఎక్స్ప్రెస్ బోగీ పట్టాలు తప్పిందని వివరించారు.. ఈ సంఘటనతో . సికింద్రాబాద్ వెళ్లాల్సిన రెండు రైళ్ల వేళలను మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు..పద్మావతి ఎక్స్ ప్రెస్ తో పాటు రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను రీషెడ్యూల్ చేశామని,,పద్మావతి ఎక్స్ ప్రెస్ ను రాత్రి 7.45 గంటలకు,,రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు వివరించారు.
►తిరుపతి : రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన తిరుపతి – తిరువనంతపురం ట్రైన్ చివరి బోగి
►ట్రైన్ కు ప్రయాణికులు లేని భోగిని అటాచ్ చేసే క్రమం చోటు చేసుకున్న ఘటన
►వెంటనే గుర్తించి బోగీని పట్టాల పైకెక్కించిన రైల్వే సిబ్బంది pic.twitter.com/4O9nZ3aJgV— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 19, 2023