యూపీఐ ద్వారా బ్యాంకు ATMల వద్ద క్యాష్ డిపాజిట్,విత్ డ్రా-ఆర్బీఐ
అమరావతి: యూపీఐ ఆధారిత సేవలు అయిన Phonepe,,Gpay,,భారత్పే లాంటి మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.. శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాస ద్రవ్యపరపతి సమీక్ష సమావేశం ముగిసింది..ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ బ్యాంకు శాఖలపై క్యాష్ హ్యాండ్లింగ్ లోడ్ తగ్గించడానికి,, ఖాతాదారుల సౌకర్యార్థం క్యాష్ డిపాజిట్ మెషిన్ల (CDM)ను బ్యాంకులు ఏర్పాటు చేస్తాయన్నారు.. ఇప్పటి వరకూ డెబిట్ కార్డుల వినియోగించి మాత్రమే మెషీన్ లో క్యాష్ డిపాజిట్ సౌకర్యం లభిస్తుంది..తాజాగా నిర్ణయంతో ATMల వద్ద ‘డెబిట్ కార్డు’ లేకుండా UPI ద్వారా నగదు విత్ డ్రాయల్ చేయొచ్చు..అలాగే యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదిస్తున్నమని,, త్వరలో ఈ సేవలు అమల్లోకి వస్తాయన్నారు.