AMARAVATHINATIONAL

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ కు CBI నోటీసులు

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఏప్రిల్ 16వ తేదిన విచారణకు రావాలని CBI నోటీసులు జారీ చేసింది.. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని CBI నోటీసుల్లో పేర్కొంది.. ఇప్పటికే ఈ కేసులో పలు రాష్ట్రాలకు చెందిన MP,,MLCలు, పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. పలువురిని ED విచారించింది.. మార్చిలో సిబిఐ డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది..మనీష్ సిసోడియా చార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటంలో ఇప్పుడు ఆయన్ను విచారించాలని నిర్ణయించింది..మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం..ఏప్రిల్ 16వ తేదీ ఆదివారం ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి ?

ఢిల్లీ లిక్కర్ స్కాం మూడు రోజుల క్రిందట జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు.. అందులో ఏకే,, అంటే అరవింద్ కేజ్రీవాల్ అని,,ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని తెలంగాన భవన్ లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా తన లేఖలో వివరించాడు..ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాట్ చేసినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ సైతం జైలు నుంచే,,తన లాయర్ ద్వారా బయటకు విడుదల చేశాడు..ప్రస్తుతం ఢిల్లీలో పాత లిక్కర్ పాలసీనే అమలవుతుంది..మద్యం స్కాం బయట పడడంతో మరో ఆరు నెలలు పాత పాలసీని కొనసాగిస్తూ,, ఇటీవలే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *