అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలకు అవకాశం? ఐఎండీ
అమరావతి: దక్షిణ అండమాన్ అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.. ఈ తీవ్ర అల్పపీడనం కాస్త పశ్చిమ వాయువ్య దిశగా కదులుతు వాయుగుండంగా బలపడనున్నది..వాయువ్యదిశగా కదులుతూ నైరుతి దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడి,, డిసెంబర్ 2వ తేదినాటికి తుఫాన్ గా మారే అవకాశం వుందని (తుఫాన్ గా మారితే దానికి ‘మిచౌంగ్’ గా నామకరణం చేస్తారు.) ఐఎండీ పేర్కొంది..
తుఫానుగా మారిన తరువాత దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు..తుఫాను తీరం దగ్గరకు వచ్చే కొద్దీ దాని ప్రభావం మరింత పెరుగుతుందని,,కోస్తా వైపు తుఫాను వస్తున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తాలో కురుస్తాయన్నారు..ఆ సమయంలో మత్స్యకారులకు సముద్రంలో వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తామన్నారు..గాలుల తీవ్రత 45 నుంచి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగం కూడా విచే అవకాశం ఉందన్నారు..తుఫాను దిశ గమనాన్ని బట్టి ఎక్కడ తీరం దాటుతుందని విషయం అంచనా వేయాల్సి ఉంటుందన్నారు..